ఎయిర్ ఆసియా 20 లక్షల జరిమానా !

Telugu Lo Computer
0


ఎయిర్‌ ఆసియా పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించడంతో డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. ట్రైనింగ్‌ సమయంలో పైలట్ల నెపుణ్యానికి సంబంధించిన టెస్ట్‌, ఇన్‌ స్ట్రుమెంటేషన్‌ రేటింగ్‌ చెక్‌ తదితరాలను కచ్చితంగా విమానయాన సంస్థలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎయిర్‌ ఆసియా అలా తనిఖీలు చేయడం లేదని తేలింది. దీన్ని నిర్ధారించుకున్న డీజీసీఏ జరిమానాతో తొలి హెచ్చరిక జారీ చేసింది. విధి నిర్వహణలో విఫలమైనందుకు ఎయిర్‌ ఆసియా హెడ్‌ ట్రైనీని మూడు నెలల పాటు సస్పెండ్‌  డీజీసీఏ చేసింది. ఎయిర్‌ ఆసియా నియమించిన ఎనిమిది మంది ఎగ్జామినర్‌ లకు ఒక్కొక్కరికి రూ. 3లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ వ్యవహారం గురించి తెలిసి కూడా ఎయిర్ ఆసియా సంస్థ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందో వివరణ కోరుతూ ఇటీవలే ఆ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది డీజీసీఏ. షోకాజ్ నోటీసులకు వివరణ వచ్చిన తర్వాత తాజాగా జరిమానాలు విధిస్తూ చర్యలు తీసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)