త్రిపురను భయం, హింస నుంచి కాపాడింది బీజేపీయే !

Telugu Lo Computer
0


ఈ నెల 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాసాలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొని మాట్లాడుతూ త్రిపురలో ప్రజల్ని భయం, హింస నుంచి రక్షించింది బీజేపీ మాత్రమేనన్నారు. మరోసారి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు అభివృద్ధి లేకుండా చేశాయని మోడీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైందన్నారు. గతంలో కమ్యూనిస్టుల పాలనతో పోలీసు స్టేషన్లను సీపీఎం కార్యకర్తలు ఆక్రమించేవారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని ప్రధాని మోడీ అన్నారు. త్రిపురలో అన్ని గ్రామాల్ని కలుపుతూ బీజేపీ సర్కార్ 5 వేల కిలోమీటర్ల రోడ్లు వేసిందని గుర్తుచేశారు. అగర్తలలో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు ఆప్టికల్ ఫైబర్, 4జీ నెట్ వర్క్ కూడా తెచ్చినట్లు మోడీ చెప్పుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)