ప్రేమ వ్యవహారం నచ్చక యువతిని హత్య చేసిన కుటుంబం !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, లింబగో పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి బీహెచ్‌ఎంఎస్‌ మూడో ఏడాది చదువుతున్నది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఆమె ప్రేమించింది. కుటుంబ సభ్యులు ఆ యువతికి పెళ్లి సంబంధం చూసి ఒక వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు. అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని తాను ప్రేమిస్తున్నట్లు అతడితో ఆమె చెప్పింది. దీంతో ఆ వ్యక్తితో పెళ్లి రద్దు అయ్యింది. ఈ సంఘటనపై యువతి కుటుంబ సభ్యులు చాలా అసంతృప్తి చెందారు. యువతి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యలు కలిసి ఈ నెల 22న రాత్రి వేళ ఆమెను పొలం వద్దకు తీసుకెళ్లి, తాడుతో గొంతు నొక్కి హత్య చేశారు. సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని దహనం చేశారు. ఆపై అవశేషాలను కాలువలో పడేశారు. మరోవైపు యువతి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రేమ వ్యవహారం నచ్చని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)