తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో భూ వివాదంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాగినేడు గ్రామానికి చెందిన నాగపూరి రాజుకుమార్ (20) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు తన సెల్ఫోన్లో వాట్సప్ మేసెజ్ ద్వారా తన నాయనమ్మ వీరమ్మ, అత్త బుర్ర స్రవంతి భూమి విషయంలో మానసికంగా బాధపెట్టడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. తన చావుకి వారే కారణమని రాత్రి పెద్దపల్లి, మంథని ప్లైఓవర్ బ్రిడ్జి కింద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం రైల్వే హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
January 04, 2023
0