దేశంలో గడచిన 24 గంటల్లో 2,570 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. క్రితం రోజుకంటే 175 కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉంది. కరోనా నుంచి నిన్న 187 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09శాతంగా ఉంది. వ్యాక్సిన్ డ్రైవ్లో భాగంగా గడచిన 24 గంటల్లో 48,292 డోసుల్ని అందజేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 91.13 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వీటిలో 2,01,690 నమూనాలను గడచిన 24 గంటల్లో నిర్వహించబడ్డాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
దేశంలో 2,570 కొత్త కరోనా కేసులు నమోదు
January 04, 2023
0
Tags