సిలిండర్ పేలి ఆరుగురు సజీవ దహనం

Telugu Lo Computer
0


హర్యానాలోని పానిపట్‌, తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు, తమ నలుగురు పిల్లలతో సహా సజీవ దహనమైయ్యారు. మృతులను అబ్దుల్ కరీం (50), అతని భార్య ఆఫ్రోజా (46), పెద్ద కుమార్తె ఇష్రత్ ఖాతున్ (18), రేష్మా (16), అబ్దుల్ షకూర్ (10), అఫాన్ (7)గా గుర్తించారు. వీరు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గది తలుపులు మూసి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. భార్యాభర్తలు, నలుగురు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిచి విచారణ చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)