హైకోర్టు ఆదేశాలతో నిలిచిన ప్రసాదం విక్రయాలు !

Telugu Lo Computer
0

శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాద విక్రయాలను బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్‌కోర్ ట్రస్ట్ ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి హైకోర్టు అనుమంచింది. కాగా, కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)