గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తుల నుండి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా హుజూర్ నగర్, గరిడేపల్లి, నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం పై జిల్లా వ్యాప్తంగా వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తుండగా హుజూర్ నగర్ మీదుగా అనుమానంగా వెళుతున్న ఉన్న కారును తనిఖీ చేసి 20 kg ల గంజాయిని హుజూర్ నగర్ సి. ఐ అధ్వర్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగినదని, అలాగే గరిడేపపల్లిలో నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తి వద్ద ఒక కేజీ గంజాయి సీజ్ చేయడం జరిగినదనీ ,బస్సులో అనుమానంగా ప్రయాణిస్తున్న ఇద్దరినీ నడిగుడెం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుండి 1.5 కేజీ ల గంజాయి సీజ్ చేయడం జరిగినదనీ తెలిపారు. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. వీరి నుండి సుమారుగా 5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నరు. హైదరాబాద్ కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్, రోహన్ రాజ్ ఫుట్ కాలు తివారి నలుగురు కలిసి జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారనీ వివరించారు. ఈ నెల 5న జూమ్ లో క్యాబ్ బుక్ చేసుకొని 20కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ తరలించాల్సి ఉండగా పోలీసుల చెకింగ్ లకు భయపడి నాలుగు రోజుల పాటు అరకులో లాడ్జి తీసుకొని ఉండి ఈ నెల 9న కొనుగోలు చేసిన గంజాయిని తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా రోహన్ రాజ్ ఫుట్, కాలు తివారీ బస్సులో హైదరాబాద్ చేరుకోగా గంజాయిని తీసుకొని హుజుర్ నగర్ మీదిగా హైదరాబాద్ వెళ్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేష్ పోలీసులు చెకింగ్ చేస్తుండడంతో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డారని తెలిపారు వీరి నుండి కారు, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామనీ తెలిపారు.
Post Top Ad
adg
Tuesday, 10 January 2023
Home
5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం
Suryapeta
telangana
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
గరిడేపల్లి
నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో
హుజూర్ నగర్
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
Tags
# 5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం
# Suryapeta
# telangana
# గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్
# గరిడేపల్లి
# నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో
# హుజూర్ నగర్
About Telugu Post
హుజూర్ నగర్
Tags
5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం,
Suryapeta,
telangana,
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు అరెస్ట్,
గరిడేపల్లి,
నడిగూడెం పోలీస్ స్టేషన్ ల పరిధిలో,
హుజూర్ నగర్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment