ఒడిశాలోని కటక్ లో మకర సంక్రాంతిని పురస్కరించుకుని సింగనాథ్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేలాదిమంది తరలిరావడంతో బదంబ-గోపీనాథ్పూర్ టి-బ్రిడ్జిపై ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మకర మేళాలో తొక్కిసలాట !
January 14, 2023
0
Tags