టీచర్ల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌ !

Telugu Lo Computer
0


సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో టీచర్స్‌ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో​ మంత్రులు హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)