దేశంలో 47% పెరిగిన విమాన యానం !

Telugu Lo Computer
0


డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం స్వదేశంలో విమాన ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి. 2021 సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి చెందింది. 2021లో 8 కోట్లకుపైగా విమాన ప్రయాణం చేయగా, 2022లో అది 12 కోట్లకు పైగా పెరిగింది. 2022లో నవంబర్ కన్నా డిసెంబర్‌లో 13.69 శాతం అధికంగా విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఎయిరిండియా, స్పైస్ జెట్, గోఫస్ట్, ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఏసియా ఇండియా, విస్తారా వంటి ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణాల పెరుగుదల కనిపించింది. గో ఫస్ట్ మరియు స్పైస్‌జెట్ 2005లో విమాన కార్యకలాపాలను ప్రారంభించగా, 2006లో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఇండిగో తర్వాతి స్థానంలో నిలిచింది. నేడు 56 శాతం మార్కెట్ షేర్‌తో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా, 9.2 శాతం వాటాతో విస్తారా రెండో ర్యాంక్‌లో ఉంది. ఇక స్పైస్‌జెట్ 8 శాతం, ఎయిరిండియా 7 శాతం మార్కెట్ వాటాలతో మూడో స్థానాన్ని కంబైన్డ్‌గా దక్కించుకున్నాయి. ఇదిలావుండగా 2022 డిసెంబర్‌లో ప్రయాణికుల నుంచి 408 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం విమాన సమస్యలకు, రిఫండ్స్‌కు సంబంధించినవే. వాటిలో 98 శాతం సమస్యలను పరిష్కరించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)