జమ్మూలో ఆయుధాల డంప్ స్వాధీనం !

Telugu Lo Computer
0


జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్నారు. తీవ్రవాదుల్ని, వారితో సంబంధం ఉన్న వ్యక్తుల్ని అరెస్టు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఆర్మీ అధికారులు హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆయుధాల్ని నిల్వ చేసిన విషయాన్ని వెల్లడించారు. వాళ్లిచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించగా, భారీ ఆయుధ సామగ్రి బయటపడింది. కొత్తగా నిర్మాణమవుతున్న రెండు ప్రదేశాల్లో వీటిని దాచి ఉంచారు. ఇవి తీవ్రవాదులు దాక్కునేందుకు, వారు ఉపయోగించేందుకు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ పిర్ అనే తీవ్రవాది సూచన మేరకు ఈ పని చేసినట్లు అరెస్టైన సానుభూతిపరులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)