బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్ బై !

Telugu Lo Computer
0


బెంగళూరులోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు  మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో తన బంధం ముగిసిందని గాలి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నాటక అభివృద్ధే తన లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తామన్నారు. కల్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ కర్ణాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏయే నియోజకవర్గాల్లో పోటీచేస్తుందో త్వరలో వివరాలను వెల్లడిస్తామన్నారు. అంతేకాదు మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తామని గాలి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తాను గంగావతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కర్ణాటక రాజకీయాల్లో తన వాళ్లు అనుకున్న వారే తనను మోసం చేశారని గాలి జనార్థన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు ఎవరూ అండగా నిలబడలేదన్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప ఎవరూ కూడా తన ఇంటికి రాలేదన్నారు. వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటానని స్పష్టం చేశారు. అటు బీజేపీ మంత్రి శ్రీరాములుతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. శ్రీరాములు తనకు చిన్ననాటి స్నేహితుడని చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)