సాగర తీరంలో నేవీ వేడుకలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ సాగరతీరంలో నేవీ వేడుకలు నిర్వహిస్తున్నారు.  నేవీ డే సెలబ్రేషన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్  లో పర్యటించనున్నారు. నేవీ డే సెలబ్రేషన్స్ లో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్కే బీచ్ లో నేవీ డే సెలబ్రేషన్స్ కోసం సర్వం సిద్ధమైంది. పది రోజుల ముందు నుంచే నేవీ సిబ్బంది నేవీ డే వేడుకల కోసం రిహర్సల్స్ చేశారు. సాగర తీరాన జరుతున్న నేవీ డే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రిహార్సల్స్ చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. యుద్ధ నౌకలు, నేవీకి సంబంధించిన హెలికాప్టర్లతో విన్యాసాలు చేశారు. సముద్రంపై మూడు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్ 29కే ద్వారా యుద్ధ ప్రదర్శనలు చేయనున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లు, జెట్ ట్రైనర్ హాక్స్ తో పాటు 25 ఎయిర్ క్రాఫ్ట్ లతో నింగిలో విన్యాసాలు చేయనున్నారు. ఇవాళ జరగనున్న వేడుకలకు కూడా జనం భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)