శునకాలను చంపి చెట్టుకు వేలాడదీశారు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు శునకాలను దారుణంగా చంపేశారు. ఆపై ఓ దానిని చెట్టుకు వేలాడదీశారు. మరో దానిని పక్కనే ఉన్న ఓ గోడపై పడేశారు. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 9 లో జరిగిందీ ఘటన. శునకాలకు ఆహారం వేసేందుకు వాటిని వెతుకుతున్న సమయంలో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 429 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శునకాల కళేబరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం పంపారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)