డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు తెరిచి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్లు అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్స్లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యాన్ని విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు
December 29, 2022
0
Tags