బ్లేడుతో గొంతుకోసిన ప్రేమోన్మాది

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మాటలు కలిశాయి. స్నేహం మొదలై ప్రేమగా మారింది. తపస్వి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో బీడీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. జ్ఞానేశ్వర్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీరిద్దరూ కొన్నాళ్లు గన్నవరంలో ఉన్నారు. ఆ సమయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఓసారి అతనిపై కృష్ణా జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై ఆమె జోలికి వెళ్లను అన్నాడు. కానీ తీరు మార్చుకోలేదు. తరచూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దాంతో తపస్వి గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలికి విషయం చెప్పుకుంది. ఆ స్నేహితురాలు  అతనితో ఓసారి మాట్లాడదాం అని చెప్పి, జ్ఞానేశ్వర్‌ని తన ఇంటికి పిలిపించింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటి పై అంతస్థులో డిస్కషన్. మళ్లీ మామూలే. అప్పుడు కూడా జ్ఞానేశ్వర్‌ తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశాడు. తపస్వి.. తాను మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. అంతే జేబులోంచీ బ్లేడ్ తీసి.. ఆమె గొంతు కోసేశాడు. అది చూసిన స్నేహితురాలు గట్టిగా అరుస్తూ పై అంతస్తు నుంచి కిందకు పరుగులు పెట్టింది. ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే ఆమెను మరో గదిలోకి ఈడ్చుకెళ్లి.. తలుపులు మూసేశాడు. స్పృహ కోల్పోయిన తపస్విని గొంతుపై అదేపనిగా గాయపరిచాడు. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అతన్ని బంధించి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆ పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్‌ బ్లేడ్‌తో తన చేతిపై గాయం చేసుకుని సూసైడ్ చేసుకోబోయాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తపస్వి చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారు. వారికి సమాచారం ఇచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)