గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన  ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకు నిరసన సెగ తగిలింది. అసదుద్దీన్ రోడ్ షోలో ఉండగా పలువురు యువకులు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే అసదుద్దీన్ బహిరంగ సభకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓవైసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలే తనను అడ్డుకున్నారంటూ ఫైర్ అయ్యారు. తాము విధానసభలో 13 స్థానాల కోసం పోరాడుతున్నామని ఓవైసీ చెప్పారు. ఆ స్థానాలను గెలుచుకోవడంపైనే దృష్టి ఉందన్న ఆయన ప్రచారంలో ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారని,13 స్థానాలను తాము గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)