బీహార్ లో అనాగరిక చర్య !

Telugu Lo Computer
0


బీహార్ లోని నలందా జిల్లాలో తన సోదరి ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు రాహుల్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు. డిసెంబర్16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిట్టు కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు రాత్రి అయినా ఇంటికి తిరిగిరాకపోవటంతో ఆందోళన పడిన కుటుంబ సభ్యులు అతని స్నేహితులను, బంధువుల వద్ద విచారించారు. కానీ ఎక్కడా అతని జాడ తెలియలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, బిట్టు ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాహుల్ కుమార్ వద్ద ఉన్న బిట్టు ఫోన్ ఉండటంతో అనుమానంతో వెంటనే రాహుల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బిట్టును చంపినట్లు రాహుల్ కుమార్ అంగీకరించాడు. బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని తన సోదరి ఫోన్ తో బిట్టుకు ఫోన్ చేసి రప్పించి 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)