విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించిన కేంద్రం

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం చమురు ఉత్పత్తిదారులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు నేటి నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.4,900 గా విధిస్తున్న విండ్ ఫాల్ టాక్సును తాజాగా రూ.1,700లకు తగ్గించింది. దీని కారణంగా దేశీయ రిఫైనరీలు ఇంధనాన్ని మరింత చౌకగా ఎగుమతి చేసేందుకు వెసులుబాటు ఏర్పడింది. దీనికి తోడు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై పన్నును లీటర్‌కు రూ.5 నుంచి రూ.1.5కి తగ్గించింది. దీనివల్ల రానున్న కాలంలో విమాన ఛార్జీలు సైతం తగ్గే అవకాశం ఉందని ఏవియేషన్ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తీసుకున్న విండ్ ఫాల్ టాక్స్ తగ్గింపు నిర్ణయం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని చమురు ఎగుమతిదారులకు భారీగా లాభాలను చేకూర్చనుంది. అందుకే నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లు అత్యధికంగా లాభపడింది. ఇంధన ధరలు ఎగుమతుల కారణంగా పెరగకుండా ఉంచేందుకు కేంద్రం గతంలో దీనిని పెంచింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో దానికి అనుగుణంగా పన్నులను కేంద్రం తగ్గించింది. తాజాగా పన్ను తగ్గింపు అమలులోకి వచ్చినప్పటికీ దీనికి ముందు డిసెంబర్ 1న సైతం కేంద్రం విండ్ ఫాల్ టాక్స్ ను తొలిసారి తగ్గించింది. అప్పట్లో టన్నుకు రూ.10,200 నుంచి రూ.4,900కి టాక్సును కేంద్రం తగ్గించింది. చైనాలో కరోనా తీవ్రంగా ఉన్నందున ఉత్పాదక రంగం నెమ్మదించటంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చమురు వినియోగం తగ్గింది. డిమాండ్ తగ్గినందున ప్రస్తుతం క్రూడ్ ధరలు సైతం దానికి అనుగుణంగా తగ్గుముఖం పడుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)