ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా గార వైస్ ఎంపీపీ, శ్రీకూర్మం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బరాటం రామశేషు (45) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఉదయం తన గ్యాస్ గోడౌన్ వద్దకు గ్యాస్ బండలు లోడ్ చేయడానికి వెళ్లగా అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు సమయం చూసి పదునైన కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామశేషు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో శ్రీకూర్మంలోని తన ఇంటి నుంచి తన భారత్ గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లారు. రెండు వాహనాలకు బండలు లోడ్ చేయించి పంపించారు. మరో వాహనం కోసం ఎదురు చూస్తూ గోడౌన్ ముందు దువ్వుపేటకు వెళ్లే రోడ్డుపైకి వచ్చి నిలుచున్నారు. అదే సమయంలో అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు పదునైన కత్తితో ఆయనపై దాడి చేశారు. ముఖం, మెడపై బలంగా దాడి చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. రక్తపు మడు గులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు గ్రామంలోని వారికి విషయం చెప్పారు. రామశేషుకు భార్య జయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి బరాటం నాగేశ్వరరావు సీనియర్ వైఎస్సార్ సీపీ నాయకుడు కాగా శ్రీకాకుళం మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీ మహేంద్ర, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ సన్యాసినాయుడు, క్లూస్, డాగ్స్క్వాడ్ టీమ్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నాలుగు బృందాలుగా విడిపోయి పలు కోణా ల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకూర్మంతో పాటు చింతువలస, శ్రీకూ ర్మం జంక్షన్, అంపోలు జంక్షన్, జైలు రోడ్డులోని సీసీ ఫుటేజీలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అదేవిధంగా గ్యాస్ గోడౌన్లో పనిచేస్తున్న వ్యక్తులను విచారించి పలు విషయాలు రాబట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన డాగ్ బృందం సమీప సునామీ కాలనీ అరటి తోటల వద్దకు వెళ్లి ఆగింది.
బరాటం రామశేషు దారుణ హత్య
December 07, 2022
0