దేశంలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం 90,529 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,07,34,218కు చేరింది. ఒక్కరోజే 1,34,995 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)