మధురై ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌

Telugu Lo Computer
0


తమిళనాడు చెందిన నలుగురు వ్యక్తులు మంగళ, బుధవారాల్లో దుబాయ్‌, చైనా నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో దిగిన అనంతరం వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ పేర్కొంది. చైనా నుండి శ్రీలంక మీదుగా మధురై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌ లంక విమానం చేరుకుంది. అందులో 70 మంది ప్రయాణీకులు ఉండగా ఎయిర్‌పోర్టులో వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బుధవారం ఉదయం దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు చైన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కరోనా టెస్టుల సందర్బంగా వీరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో​, తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటటంతో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)