తెలంగాణలో కొనసాగుతున్న పోడు భూముల సర్వే

Telugu Lo Computer
0


తెలంగాణలో లోని సిర్పూర్ ఏజేన్సీలో పోడు భూముల సర్వే విస్తారంగా కొనసాగుతుంది. గ్రామాల్లో ఆటవీ, రెవెన్యూ శాఖలతో పాటు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఈ మేరకు గ్రామాల్లో పోడు భూముల సర్వే ఊపందుకుంది. శనివారం నేట్నూర్ గ్రామ పంచాయతీలో పోడు భూముల సర్వే అయా శాఖల ఆధికారులతో పాటు గ్రామ సర్పంచ్ అర్క హిరాబాయి నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)