తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ద శ్రీ బాసర సరస్వతి అమ్మవారిని శనివారం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద మంత్రోశ్చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతని వెంట ముథోల్ సీఐ వినోద్ కుమార్, తదితరులు ఉన్నారు.