ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని చాందినీచౌక్ భగీరథ ప్యాలెస్ మార్కెట్ లో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 32 అగ్నమాపక వాహనాలను హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. రిమోట్ కంట్రోలుతో పనిచేసే అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించామని ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో చాందినీచౌక్ లోని ప్రధాన భవనం దెబ్బతిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. హర్షవర్థన్ గురువారం రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించారు. మంటలను అదుపు చేస్తున్నామని, ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ మరణించలేదని హర్షవర్థన్ చెప్పారు. చాందినీచౌక్ లో అగ్నిప్రమాదంలో మంటలను ఆర్పడానికి 40 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చామని, శుక్రవారం ఉదయం కల్లా మంటలను అదుపులోకి తీసుకువస్తామని ఢిల్లీ ఫైర్ సర్వీసుల శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.ఈ అగ్నిప్రమాదంలో భగీరథ ప్యాలెస్ మార్కెటులోని పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)