కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలోని చంపా షష్టి సందర్భంగా హిందూ జాగరణ్ వేదిక ఇతర వర్గాల దుకాణాలు, స్టాళ్లను నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్లు వేసింది. కుక్కే సుబ్రహ్మణ్య చంపా షష్టి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్థుల వ్యాపార లావాదేవీలు నిషేధించాం'' అని హిందూ జాగరణ్ వేదికకు చెందిన సుబ్రమణ్య యూనిట్ పేరుతో పోస్ట్ చేసిన పోస్టర్లో ఉంది. పండుగలో భాగంగా ఆలయం చుట్టూ ఒక జాతర నిర్వహించనున్నారు. ఈ జాతరలో బొమ్మలు, పండ్లు, బట్టలు, ఇతర వస్తువులను విక్రయించే పలు దుకాణాలను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు.హిందూ సమాజానికి అవగాహన కల్పించడానికి ఇతర మతస్థుల వ్యాపారాలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని హిందూ జాగరణ వేదిక స్థానిక కోఆర్డినేటర్ నరసింహ శెట్టి మణి చెప్పారు. కర్ణాటక హిందూ మత సంస్థలు, ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను పాటిస్తున్నాయని ఆలయ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు మోహనరామ్ తెలిపారు.
ఇతర మతస్థుల వ్యాపార లావాదేవీలు నిషేధం !
November 25, 2022
0
Tags