ఢిల్లీ డెవలప్‌మెంట్ కమిషన్ వీసీ జాస్మిన్ షా తొలగింపు

Telugu Lo Computer
0


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్  వీకే సక్సేనా ఢిల్లీ డెవలప్‌మెంట్ కమిషన్ వీసీగా ఉన్న జాస్మిన్ షాను తొలగిస్తూ ఢిల్లీ ఎల్-జీ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసినందున ఢిల్లీ డెవలప్‌మెంట్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి జాస్మిన్ షాను తొలగించాలని ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రణాళికా విభాగం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ జారీ చేసింది.డిస్కమ్‌లకు ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలో జరిగిన అక్రమాలు లేవనెత్తుతూ ఎల్జీ సెక్రటేరియట్‌కు ఫిర్యాదు అందింది. ఆప్ రాజ్యసభ ఎంపీ ఎన్డీ గుప్తా కుమారుడు జాస్మిన్ షా, నవీన్ గుప్తా కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)