యూనివర్సిటీ ఆఫ్ డిల్లీలోని, 'ఫ్యాకల్టీ ఆఫ్ లా'లో అరుణ్ జి.కృష్ణన్ అనే వ్యక్తి లా చివరి సంవత్సరం చదువుతున్నాడు. తిరువనంతపురంలో ఉన్నప్పుడు జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. దీనికి ముందుగానే రూ.362 చెల్లించాడు. అయితే, అతడికి ఫుడ్ డెలివరీ చేయలేదు. అలాగని డబ్బులు కూడా రీఫండ్ చేయలేదు. దీనిపై అతడు జొమాటోకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో అతడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అరుణ్కు అతడు చెల్లించిన రూ.362తోపాటు నష్ట పరిహారం కింద రూ.5,000, కోర్టు ఖర్చుల కింద రూ.3,000 కలిపి మొత్తం రూ.8,362 చెల్లించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్భంగా దీనిపై జొమాటో అభ్యంతరం వ్యక్తం చేసింది. డెలివరీ చేసే విషయంలో తమ పొరపాటు ఏమీ లేదని వ్యాఖ్యానించింది. డెలివరీ అడ్రస్ సరిగ్గా లేదని, ఫుడ్ డెలివరీ చేసేందుకు అతడిని సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదని జొమాటో కోర్టుకు తెలిపింది. అయితే, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అరుణ్కు నిర్దేశించిన మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, తనకు నష్ట పరిహారం కింద రూ.1.5 లక్షలు, కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించేలా ఆదేశించాలని అరుణ్ కోరాడు. కానీ, దీనికి నిరాకరించిన కోర్టు రూ.8.632 మాత్రమే చెల్లించేలా జొమాటోను ఆదేశించింది.
Post Top Ad
adg
Wednesday, 16 November 2022
Home
kerala
New Delhi
zomato
అరుణ్ జి.కృష్ణన్
జొమాటోపై లా స్టూడెంట్ కేసు !
వినియోగదారుల కోర్టు
జొమాటోపై లా స్టూడెంట్ కేసు !
జొమాటోపై లా స్టూడెంట్ కేసు !
Tags
# kerala
# New Delhi
# zomato
# అరుణ్ జి.కృష్ణన్
# జొమాటోపై లా స్టూడెంట్ కేసు !
# వినియోగదారుల కోర్టు
About Telugu Lo Computer
వినియోగదారుల కోర్టు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment