ఎంఐం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అహ్మదాబాతద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు కూర్చున్న బోగీపై రాళ్లు రుతవ్వడంతో ఆ బోగీలోని అద్దాలు పగిలాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత వారిస్ పఠాన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్లో ఆయన పోస్టు చేశారు. సూరత్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి !
November 08, 2022
0