బ్రతికి లేని భర్త పేరిట ఇన్సూరెన్స్ క్లెయిమ్ !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన పూల్భాయ్ అనే మహిళ చనిపోయిన తన భర్త తుకారంపై 25 సంవత్సరాలకు 2012లో జీవిత భీమా పాలసీ తీసుకుంది. తీసుకున్న 14 రోజులకే అతడు చనిపోయాడని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.1.60 కోట్లను క్లెయిమ్ చేసుకుంది. అయితే అంతకుముందే చనిపోయిన భర్త విషయాన్ని కంపెనీకి తెలియకుండా జాగ్రత్త పడింది. అందుకు ఇన్సూరెన్స్ ఏజెంట్ బద్రిలాల్ సహాయం తీసుకుంది. ఇద్దరు కలిసి తుకారం బ్రతికే ఉన్నట్లుగా డాక్యుమెంట్స్ సృష్టించారు. వెరిఫికేషన్ సమయంలో వాటిని ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించారు. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చి మరోసారి వెరిఫికేషన్ చేసుకుంది. అప్పుడు అసలు మోసం బయటపడింది. మహిళ మోసంపై ఆశ్చర్యపోయిన కంపెని మోసాన్ని గ్రహించి కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)