ఉజ్జయినిలో ఉషారుగా సాగిన భారత్ జోడో యాత్ర !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని భారత్ జోడో యాత్ర ఉజ్జయినిలో ఉషారుగా సాగింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెంట సినీనటి స్వరభాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. ఈ జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర 83వ రోజు గురువారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మీదుగా సాగుతోంది. గత వారం తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి రాహుల్ నడిచారు. సెప్టెంబరు 7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా సాగింది. మరో 1209 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)