ఒక సాధారణ డెలివరీ బాయ్లా రెడ్ టీ షర్ట్ ధరించి, బైక్ మీద జోమాటో సీఈవో దీపేందర్ గోయల్ ఫుడ్ డెలివరీలు చేస్తున్నారు. గత మూడేళ్లలో ఆయన ఇదే పనిచేస్తున్నారట. ఈ విషయాన్ని నౌకరీ.కామ్ యాజమాని సంజీవ బిక్చందానీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఒక్కరే కాదు, కంపెనీలో పనిచేసే సీనియర్ మేనేజర్లందరూ కూడా సాధారణ డెలివరీ బాయ్లాగా రోడ్లపైకి ఎక్కి ఫుడ్ను డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ విషయాన్ని సంజీవ్ ట్విటర్ యూజర్లతో పంచుకున్నారు. గడిచిన మూడేళ్లుగా దీపిందర్ ఇదే పనిచేస్తున్నారని వివరించారు. అయినా ఇప్పటి వరకు తనను ఎవరూ గుర్తు పట్టలేదని దీపిందర్ తనతో చెప్పినట్లు సంజీవ్ తెలిపారు. సంజీవ్ ట్వీట్ చూసిన నెటిజన్లు జొమాటో సీఈఓపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ఫుడ్ను ఆయన డెలివరీ చేస్తే చూడాలని ఆసక్తిగా ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. దీనివల్ల వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు.. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల వెతలను అర్థం చేసుకోవడానికి వీలు పడుతుందని ఓ వ్యక్తి కామెంట్ రూపంలో తెలియజేశారు.
డెలివరీ బాయ్లా ఫుడ్ డెలివరీ చేస్తున్న జోమాటో సీఈవో
October 11, 2022
0
Tags