దంపతుల మధ్య గొడవకు పొరుగింటి వ్యక్తి బలి !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఇంట్లో మాంసం వండటంపై పప్పు, అతడి భార్య గొడవ పడ్డారు. మంగళవారం నాడు కొందరు హిందువుల ఇంట్లో నాన్‌వెజ్‌ వండరు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు  ఇంట్లో మాంసం వండటాన్ని పప్పు భార్య వ్యతిరేకించింది. దీంతో ఈ అంశంపై ఆ దంపతులు పోట్లాడుకున్నారు. దంపతుల గొడవ విన్న పొరుగున నివాసం ఉండే బిల్లు వారి ఇంటికి వెళ్లాడు. ఆ దంపతులకు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేసి తన ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతసేపటి తర్వాత  బిల్లు ఇంటికి పప్పు వెళ్ళి అతడ్ని కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. పప్పు భార్య స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆమె భర్తను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)