రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలోని చర్ఖాను ముర్ము తిప్పడం అందర్నీ ఆకర్షించింది. అక్కడే ఉన్న ఆశ్రమం మహిళ సహాయంతో దారాన్ని చర్ఖాకు పెడుతూ.. చర్ఖాను ఎలా తిప్పాలో ఆసక్తిగా నేర్చుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ముర్ముతో పాటు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ కూడా భాగస్వామ్యులయ్యారు. ఇదిలా ఉండగా గాంధీనగర్లో ఆరోగ్యం, నీటిపారుదల, నీటి సరఫరా, ఓడరేవు అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ఆమె ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రపతి హోదాలో ఆమె గుజరాత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
సబర్మతి ఆశ్రమంలో మహాత్ముడికి రాష్ట్రపతి నివాళులు
October 03, 2022
0
Tags