దేశంలో గడిచిన 24 గంటల్లో 1.22 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,529 కొవిడ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 3,533 మంది కోలుకోగా.. 32,282 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 218.84 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 94.88 కోట్ల మంది రెండో డోసు వేసుకోగా.. 21.47 కోట్ల మంది ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 2,529 కొవిడ్ కేసులు నమోదు
October 06, 2022
0
Tags