ఈడీ ముందు హాజరైన గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణకు హాజరుఅయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈక్రమంలో ఈరోజు ఈడీ విచారణకు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50ఏ ప్రకారం ఈ ఇద్దరిని ఈడీ అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు వచ్చిన విరాళాల విషయంపై అధికారులు విచారిస్తున్నారు. ఇద్దరు నేతల స్టేట్ మెంట్ లను అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)