ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు డైలీ మార్కెట్లో పులస ఏకంగా రూ.22 వేలు పలికింది.. ఈ సంవత్సరంలో మొదటి పులస మార్కెట్కు రావడంతో కొనుగోలు చేయడానికి పులుసు ప్రియులు ఎగబడ్డారు. రాజోలు కుంచెందిన బైరిశెట్టి శ్రీరాములు 3 కిలోల పులస చేపను 22 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సార్లు భారీ వరదలు వచ్చినా, గోదావరిలో పులస జాడ కనిపించలేదని మత్స్యకారులు చెబుతున్నారు.
22 వేల రూపాయలు పలికిన పులస !
October 08, 2022
0
Tags