పాక్ ఆర్మీ అధికారులతో వెళ్తున్న చాపర్ మిస్సింగ్ !

Telugu Lo Computer
0


పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో ఓ చాపర్ కనిపించకుండా పోయింది. అందులో సీనియర్ మిలిటరీ అధికారులు ఉన్నారు. ఏవియేషన్ కార్ప్స్‌కు చెందిన చాపర్.. ఆర్మీకి సహకారం అందించేందుకు పనిచేస్తోంది. అయితే అదీ బలూచిస్థాన్ వెళ్లాక సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. లాస్ బెలాలో ఆ చాపర్ వరద సహాయక పనులను చేస్తోంది. 5 గంటల తర్వాత దాని ఆచూకీ తెలియలేదు. ఆ సమయంలో చాపర్‌లో ఆరుగురు ఉన్నారు. క్వెట్టా కార్ప్స్ కమాండర్ కూడా ఉన్నారు. వారే వరద సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ చాపర్ ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)