దేశంలో కొత్తగా 13,434 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయని,  17,897 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,33,83,787కు చేరిందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.34 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.79 శాతంగా ఉందని చెప్పింది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. నిన్న కరోనా వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో కరోనా మృతుల సంఖ్య మొత్తం 5,26,430కు చేరింది. దేశంలో నిన్న 4,11,102 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87.58 కోట్లకు చేరినట్లు వివరించింది. దేశంలో నిన్న 26,77,405 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.6 కోట్లకు చేరిందని వివరించింది. వాటిలో రెండో డోసు 93.33 కోట్లు, బూస్టర్ డోసు 9.28 కోట్లు ఉన్నాయని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)