దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే,  19,928 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,34,65,552కు చేరిందని వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,34,793 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని పేర్కొంది.కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 5,26,649 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశ వ్యాప్తంగా 32,73,551 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,05,92,20,794కు చేరిందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)