కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం !

Telugu Lo Computer
0


కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా వస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతోంది.  దీంతో శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 క్రస్టుగేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్‌లో ఒకేసారి 27 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. సాయంత్రం 6 గంటలకు వరద తగ్గడంతో 17 గేట్లు మూసి వేసి, 75,005 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయంలో జూరాలకు 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి.. సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి సాయంత్రం 6 గంటలకు 1,52,589 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 62,896 క్యూòÜక్కులు, స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, మొత్తం ప్రాజెక్టు నుంచి 2,02,811 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.8 అడుగులు, 214.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి 88,470 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు. కాగా శుక్రవారం రాత్రికి 1,088.6 (78.34 టీఎంసీలు) అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)