దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 13,734 కేసులు నమోదవగా, బుధవారం 17,135 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,40,67,144కు చేరాయి. 4,34,03,610 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,477 మంది కరోనాకు మరణించగా, మరో 1,37,057 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 47 మంది మరణించగా, 19,823 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.32 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.69 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 204.84 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదు
August 03, 2022
0