దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 39 మంది మృతి చెందారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 4,40,36,275 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 4,33,65,890 మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,396 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. 1,43,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నమోదైన మొత్తం కేసుల్లో 0.33 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 204.34 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)