బూస్టర్ డోసు తీసుకుంటే ఉచితంగా చోలే బటూరే !

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని చండీఘడ్‌కు చెందిన సంజయ్ రాణా అనే చిరు వ్యాపారి సైకిల్‌పై చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. దాదాపు పదిహేనేళ్లుగా వీధుల్లో తిరుగుతూ చోలె బటూరేతోపాటు ఇతర ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్ముతున్నాడు. గత ఏడాది రాణా ఒక ఆఫర్ ప్రకటించాడు. ఎవరైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని, అందుకు తగ్గ ఆధారాలు చూపిస్తే ఉచితంగా చోలే బటూరే అందిస్తానని ప్రకటించాడు. చెప్పినట్లుగానే చాలా మందికి చోలే బటూరే ఉచితంగా అందించాడు. అప్పట్లో ఆయన చేస్తున్న పనికి మంచి గుర్తింపు, దేశవ్యాప్తంగా ప్రచారం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన్ను ప్రశంసించారు. 'మన్ కీ బాత్'లో రాణా చేస్తున్న సేవ గురించి ప్రస్తావించారు. సమాజానికి మేలు కలిగించే పనులు చేయడం అందరి బాధ్యత అని, సంజయ్ రాణా మంచి పని చేస్తున్నాడని అభినందించారు. తన కూతురు రిధిమ, మేన కోడలు రియా ఇచ్చిన సలహా ప్రకారం ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంజయ్ చెప్పాడు. తాజాగా మరోసారి ఈ ఆఫర్ ప్రకటించాడు సంజయ్. ఈసారి బూస్టర్ డోసు తీసుకున్న వారికి ఉచితంగా చోలే బటూరే అందిస్తానన్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అదేరోజు తన దగ్గరికి వచ్చి చోలే బటూరే ఉచితంగా తినొచ్చని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి, అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు చెప్పాడు. ఇప్పటికీ ఇంకా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదని, అదరూ త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)