ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో కారు అదుపు తప్పి రిక్షా మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. మైనర్లు కారు నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఓ వ్యక్తి కాలు నుజ్జునుజ్జవగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవింగ్ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిలో కారు బీభత్సం !
July 06, 2022
0
Tags