జుట్టు ఊడిపోతుందని యువతి ఆత్మహత్య

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మైసూరులో రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్‌లో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. మృతురాలిని కావ్యశ్రీ (21) గా గుర్తించారు. వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయని, దీంతో మనస్థాపం చెందిన కావ్యశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై నజరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కావ్యశ్రీ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)