రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ‘మెంటల్ ట్రీట్మెంట్’ తీసుకోవాలని బీజేపీ ఎంపీ అశోక్ బాజ్పేయీ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ‘పనికిరానివాడు’ అంటూ ఇటీవల అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఇవాళ అశోక్ బాజ్పేయీ మీడియాతో మాట్లాడుతూ అశోక్ గహ్లోత్పై విమర్శలు గుప్పించారు. ”అశోక్ గహ్లోత్ మానసిక చికిత్స తీసుకోవాలి. ఆయన కురువృద్ధుడైపోయారు.. ఆ ప్రభావం ఆయన ప్రవర్తనపై కనపడుతోంది. కేంద్ర మంత్రి షెకావత్ అతి తక్కువ సమయంలో ప్రజలకు నల్లాల ద్వారా నీరు అందించారు. ప్రభుత్వం ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించిందో వాటిని చాలా శ్రద్ధతో పూర్తి చేశారు. ఇలా కష్టపడి పనిచేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తి అశోక్ గహ్లోత్కి పనికిరానివాడిగా కనపడుతున్నారట. అశోక్ గహ్లోత్ కళ్ళలో ఏదైనా సమస్య ఉండొచ్చు లేదంటే ఆయనకు మానసిక చికిత్స అవసరం” అని అశోక్ బాజ్పేయీ విమర్శలు గుప్పించారు.
'మెంటల్ ట్రీట్మెంట్ తీసుకో'
July 03, 2022
0
Tags