డిప్యూటీ కలెక్టర్​పై దంపతుల దాడి !

Telugu Lo Computer
0


అరవింద్ మహోర్ మధ్యప్రదేశ్ లోని మంద్​సౌర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్​గా పనిచేస్తున్నారు. పిప్లియా మండీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనేందుకు కారులో వెళ్తున్నారు. మరోవైపు రోడ్డు పక్కన చిన్న హోటల్​ నడుపుకునే మోహన్ లాల్, అతడి భార్య భావన బైక్​పై అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. అయితే మోహన్​ లాల్​ ద్విచక్ర వాహనంపై రకరకాల విన్యాసాలు చేశాడు. డిప్యూటీ కలెక్టర్​ కారుకు పదేపదే అడ్డం వచ్చాడు. ఓ దశలో డిప్యూటీ కలెక్టర్​ వాహనం ఆపి మోహన్​ లాల్​తో మాట్లాడారు. బైక్​పై స్టంట్స్​ చేయకుండా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వెంటనే మోహన్​ లాల్, అతడి భార్య కోపోద్రిక్తులయ్యారు. 'మాకే చెబుతావా' అంటూ దాడికి తెగబడ్డారు. డిప్యూటీ కలెక్టర్​ కాలర్​ పట్టుకుని భావన చెప్పుతో కొట్టింది. అరవింద్​ ఫిర్యాదు మేరకు ఎస్​సీ/ఎస్​టీ వేధింపుల నిరోధక చట్టం సహా వేర్వేరు సెక్షన్ల కింద మంద్​సౌర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)