కోల్‌కతాలో అండర్‌ వాటర్‌ 'మెట్రో రైలు' !

Telugu Lo Computer
0


దేశంలోనే మొదటి అండర్‌ వాటర్‌ మెట్రోను తీసుకొచ్చేందుకు ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. కోల్‌కతా లోని సెక్టార్‌ 5 నుంచి హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా టన్నెల్‌ను నిర్మించనున్నారు. 2023 నాటికి దీన్ని ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. నీటిలో ఈ మెట్రో మొత్తం ప్రయాణ దూరం 16.6 కిలోమీటర్లు. అండర్‌ గ్రౌండ్‌లోనే 10.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో 520 మీటర్ల మేర నీళ్ల మధ్య నుంచి దూసుకెళ్తుంది. ఈ మెట్రో రైలు నిర్మాణం పూర్తి అయితే ఆ అనుభూతిని భారత్ లో తొలిసారిగా కలకత్తా వాసులు ఆస్వాదించనున్నారు. ఈ మెట్రోకు మొత్తం 11  స్టేషన్లు ఉంటాయి. అదే అండర్ గ్రౌండ్ లో రెండు స్టేషన్లు ఉండనున్నాయి. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ జంట సొరంగాలను కలుపుకోవడానికి హుగ్లీ నదిపై సుమారు 500 మీటర్ల వరకు విస్తరించి ఉన్న తూర్పు-పశ్చిమ కారిడార్‌ను విస్తరించింది. రైలు మునిగినప్పుడు 10-అంతస్తుల నిర్మాణానికి సమానమైన లోతులో ప్రయాణిస్తుంది. 1.4 మీటర్ల డల్పు గల కాంక్రీట్ రింగులతో నిర్మించిన జంట సొరంగాలు మెట్రో రైలులో నీటి అడుగున భాగాన నిర్మించనున్నారు. సొరంగాల్లోకి నీరు రాకుండా వాటికి హైడ్రోఫిలిక్ రబ్బరు పట్టీలు అమర్చనున్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 8,600 కోట్లు  అంచనా వేశారు.  మార్చి 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)